|
మృగమదంబు జూడ మీఁద నల్లగనుండు
పరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా!
విశ్వదాభిరామ వినుర వేమ!
తా: కస్తూరి పైకి నల్లగా పనికి రానిదిగా కనబడుచుందును. కాని దాని సువాసన మాత్రము చాలా దూరము వ్యాపించును. అట్లే గురువులైన వారు పైకి చాలా నిరాడంబరులుగా కనబడుచుందురు, గాని వారి యుపదేశములు మొక్షదాయకములగుచుండును.
****************************************************************************************
జూన్ 11(జవాబుల కొరకు ప్రశ్నలపై క్లిక్ చెయ్యండి)
1. నారదపురాణములో ఎన్ని శ్లోకములు కలవు? 25,000 శ్లోకములు
2. కంసుని తల్లి పేరు ఏమిటి? పద్మావతి
3. రాముడు, హనుమంతుడు మొట్టమొదటిసారి కలుసుకున్న ప్రదేశం? ఋశ్యమూక పర్వతం
4. దుర్యోధనుని కొడుకు లక్ష్మణుని వధించినది ఎవరు? అభిమన్యుడు
5. మహాభారతంలో మాద్రి (పాండురాజు రెండో భార్య) అన్నగారు ఎవరు? శల్యుడు
|
|